Vijay Sethupathi | కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది వెట్రిమారన్ డైరెక్ట్ చేసినవిడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టేశాడు. ఈ బ్లాక్ బస్టర్కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తుందని తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఫస్ట్ పార్ట్లో విజయ్ సేతుపతి (VijaySethupathi) పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించాడు. కాగా సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి రోల్ కొనసాగనుండగా.. అతడికి జోడీగా మంజు వారియర్ (Manju Warrier) మెరుబోతుందని తాజా న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్గా విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించగా, కానిస్టేబుల్ పాత్రలో సూరి నటించాడు.
ప్రస్తుతం విడుతలై పార్ట్ 2 షూటింగ్ సిరుమలైలోని అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నట్టు సమాచారం. మంజు వారియర్ ఇప్పటికే వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన అసురన్ (తెలుగులో నారప్ప)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. రెండోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#ViduthalaiPart2 – #ManjuWarrier Onboard to play #VijaySethupathi‘s pair in the movie👌🔥
Previously she has acted in Asuran under the same VetriMaaran direction🤝
Shooting currently happening in Sirumalai🎬
[©️ Valaipechu] pic.twitter.com/X3Bz7hrYiP— AmuthaBharathi (@CinemaWithAB) July 25, 2023
విడుదల పార్ట్ 1 ట్రైలర్..