Vijay Sethupathi – Nithya Menon| తమిళ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). తెలుగులో ఈ సినిమాను సార్మేడమ్ (SirMadam) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ చూస్తుంటే.. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఇందులో భార్యభర్తలుగా నటించబోతున్నారు. పెళ్లి అయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత ప్రతిదానికి చిరాకు, గొడవలు పడడం. ఈ వివాదాలు వారి వైవాహిక జీవితాన్ని వారి బిజినెస్ని ఎలా ప్రమాదంలో పడేస్తాయి అనేది ఈ సినిమా కథ. అయితే ఈ సీరియస్ విషయాన్ని కామెడీగా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్. ఫ్యామిలీ సెంటిమెంట్ జానర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పాండిరాజ్ ఈసారి కామెడీ జానర్లో వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.