Naandhi Movie Director | ‘నాంది’ సినిమాతో తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala). ఒక సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అక్రమ నేరారోపణతో జైల్లో మగ్గుతున్న ఓ యువకుడి కథని చూపించాడు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 ఎంత శక్తిమంతమైనదో ఇందులో ఆలోచన రేకెత్తించేలా నాంది తీర్చిదిద్దారు. ఇక అల్లరి నరేష్ సినీ కెరీర్లో ఈ చిత్రం మంచి విజయంగా నిలిచింది.
కానీ.. రెండో సినిమాగా విజయ్, నరేష్ కలిసి చేసిన ‘ఉగ్రం'(Ugram) మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమా కూడా మిస్సింగ్ కేసుల నేపథ్యంలో రూపొందించారు. ఇప్పుడు తన మూడో సినిమా కోసం రూటు మారుస్తున్నాడు విజయ్. ఇటీవలే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఓ కథ చెప్పాడు విజయ్. నాంది, ఉగ్రం.. ఈ రెండు చిత్రాలకు భిన్నంగా ఓ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ కథ ఉండబోతుంది. విజయ్ చెప్పిన ఈ కథకు బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం బెల్లంకొండ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మతో ‘రాక్షసుడు 2’కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత విజయ్ సినిమా పట్టాలెక్కనుంది.