Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులతో సూపర్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటాడని తెలిసిందే. బిజీ షెడ్యూల్లో ఉన్నా వీలు చూసుకొని అభిమానుల కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు విజయ్ దేవరకొండ. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఎక్జయిటింగ్ వార్తను అందరితో పంచుకున్నాడు. 100 మంది అభిమానులను వారు వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి వెకేషన్ టూర్ కోసం పంపించనున్నట్టు తెలియజేశాడు.
విజయ్ నిర్వహించిన పోల్లో పాల్గొన్న ఫాలోవర్లు, అభిమానులు హిల్ స్టేషన్ మనాలీ (Manali)తోపాటు ఇతర ప్రదేశాలను ఎంచుకున్నారు. పోల్లో పాల్గొన్న వారిలో లక్కీ విన్నర్స్ ను ప్రకటించి.. త్వరలో మనాలీ టూర్కు పంపిస్తానని వెల్లడించాడు విజయ్. 5 రోజులపాటు సాగే ట్రిప్లో 100 మందిని మనాలీకి పంపించడంతోపాటు టూర్ సమయంలో వారికయ్యే పూర్తి ఖర్చులను కూడా తానే పెట్టుకుంటానన్నాడు. తాను పోస్ట్ చేసిన దేవరసాంటా గూగుల్ డాక్యుమెంట్ను నింపాలని అందరికీ సూచించాడు విజయ్ దేవరకొండ.
అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయ్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఖుషి నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే షురూ కానుంది.
విజయ్ దేవరకొండ వీడియో వైరల్
100 of you go to the mountains ❤️
Update!Happy new year.
Big kisses and lots of love to all of you.https://t.co/3e0wE3ECNt https://t.co/a5vLqeQXze pic.twitter.com/wTyZGH0JOt— Vijay Deverakonda (@TheDeverakonda) January 8, 2023