‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు బ్లాక్బస్టర్ హిట్ను అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు దిల్రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
దిల్రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా తమ సోషల్మీడియా ఖాతాల్లో దిల్రాజు, విజయ్ దేవరకొండ, పరశురామ్ భేటీ అయిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం దర్శకుడు పరశురామ్ వినూత్న కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు.