విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర గీతాలు మెలోడీ ప్రధానంగా సంగీత ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలోని ఐదో సింగిల్ ‘ఓసి పెళ్లామా..’ గీతాన్ని నేడు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు.
‘ఈ సినిమాలో విప్లవ్, ఆరాధ్య ప్రణయగాథ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. చక్కటి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాల కలబోతగా ఈ సినిమా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. విప్లవ్, ఆరాధ్య ప్రేమకథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’ అని చిత్రబృందం పేర్కొంది. సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.