Vijay Devarakonda Next Movie | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘గీతాగోవిందం’ తర్వాత ఇప్పటి వరకు విజయ్కు మరో హిట్టు లేదు. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘లైగర్’ డిజాస్టర్గా మిగిలింది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరి కెరీర్లోనూ, ఇటు విజయ్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న విజయ్ కల.. కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కోసం ముస్తాబవుతుంది. ఇదిలా ఉంటే విజయ్ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
‘గీతా గోవిందం’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్నిచ్చిన పరుశురాంతో విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళ కాంబోలో తెరకెక్కబోయే సినిమా బాలీవుడ్ రీమేక్ అని తెలుస్తుంది. షారుఖ్ఖాన్ బ్లాక్బస్టర్ చిత్రం ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షారుక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అప్పటివరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షారుఖ్ను ఈ మూవీ స్టార్ హీరోను చేసింది. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నేటి తరానికి తగ్గుట్టుగా మార్పులు చేసి రీమిక్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. అయితే ముందుగా ఈ చిత్రాన్ని షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అది ఇప్పటివరకు పట్టాలేక్కలేదు.
అయితే ఇప్పుడు ఆదిత్య చోప్రా ఈ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం విజయ్ క్రేజ్ టాలీవుడ్కు సమానంగా బాలీవుడ్లోనూ ఉంది. లైగర్ ఇక్కడ ఫ్లాప్ అయిన హిందీ బెల్ట్లో బ్రేక్ ఈవెన్ దగ్గరి వరకు వెళ్లింది. దాంతో విజయ్తో ఈ రీమిక్స్ను తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విజయ్ ఖుషీ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది.