విజయ్దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో కథానాయికగా సమంతను ఖరారు చేశారు. ఈ నెల 21న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని సమాచారం. ‘నిన్నుకోరి’ ‘మజిలీ’ వంటి హృద్యమైన ప్రేమకథల ద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజా చిత్రానికి కూడా ఓ సెన్సిబుల్, ఎమోషనల్ లవ్స్టోరీని సిద్ధం చేశారని అంటున్నారు.
కశ్మీర్ నేపథ్యంలో ఈ ప్రేమకథ సాగుతుందని..విజయ్దేవరకొండ ఆర్మీ అధికారిగా కనిపిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. పవన్కల్యాణ్ కథానాయకుడిగా దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఖుషి’ చిత్రం నాటి యువతను ఎంతగానో ఆకట్టుకుంది. వినూత్న ప్రేమకథతో మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్ను విజయ్ దేవరకొండ సినిమాకు ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.