ముంబై : బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్లోని సవాయి మదోపూర్లో ఉన్న సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో మ్యారేజ్ జరగనున్నది. డెకో ఈవెంట్స్ ఈ వెడ్డింగ్ను నిర్వహిస్తోంది. నటుల కోసం విలాసవంతమైన సూట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయిదు రోజుల పాటు ఆ హోటల్లో బాలీవుడ్ జంట గడపనున్నది. హోటల్లోని రాజా మాన్ సింగ్ సూట్ను ఆ జంట కోసం బుక్ చేశారు. ఆ సూట్ ఒక రోజు ఖరీదు 7 లక్షలు. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ హోటల్లో మొత్తం 15 సూట్లు ఉన్నాయి. ఆ రూమ్ల ఒక రోజు ఖరీదు 4 లక్షలు. విక్కీ, కత్రినా బుక్ చేసుకున్న సూట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ సూట్ నుంచి ఆరావలి పర్వతాల అందాలను వీక్షించవచ్చు. డిసెంబర్ ఆరో తేదీన ఆ హోటల్కు జంట రానున్నది. 9వ తేదీన విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం జరగనున్నది. 7న సంగీత్ సెర్మనీ, 8న మెహందీ ఉంటుంది. 10వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.