విజయ్రాజా, తమన్నా వ్యాస్ జంటగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకుడు. తూము నరసింహాపటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల సెంటిమెంట్తో సాగే ఈ చిత్రం ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ రిలేషన్స్ ఇంత గొప్పగా ఉంటాయా అనేలా కథ సాగుతుంది. కథానుగుణంగా నటీనటులు కుదిరారు’ అన్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్తో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందని నిర్మాతలు చెప్పారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ ‘నాలాంటి చిన్న హీరోకు బడ్జెట్ పరిమితులు విధించుకోకుండా సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. కథలోని నవ్యత ప్రధానబలంగా సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో యువహీరో ఆకాష్పూరి, బిగ్బాస్ 5 విన్నర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.