తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీరిలో వెంకటేశ్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఈయన నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈయన నటించిన దృశ్యం 2 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సీక్వెల్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.
దృశ్యం 2 సినిమాను అక్టోబర్లో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందు నుంచి ఓటీటీ సినిమాగా ప్రమోట్ చేసినా కూడా.. ఇప్పుడు మనసు మార్చుకుని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా వెంకటేశ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
జాతి రత్నాలు సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అనుదీప్.. ఈ మధ్య వెంకటేశ్కు ఒక కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కామెడీ అద్భుతంగా డీల్ చేస్తాడని జాతిరత్నాలు సినిమాతో నిరూపించాడు అనుదీప్. మరోవైపు వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిస్తే ఖచ్చితంగా అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సురేశ్ ప్రొడక్షన్స్లోనే వెంకటేశ్, అనుదీప్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేయనుంది. ఇదిలా ఉంటే తమిళ హీరో శివ కార్తికేయన్కు అనుదీప్ ఒక కథ చెప్పినట్లు ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
Nandita: హీరోయిన్ తండ్రి కన్నుమూత.. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
త్రిష, కీర్తి సురేష్లతో సమంత వీకెండ్ మస్తీ
Sekhar Kammula | లవ్ స్టోరీకి రిపీట్ ఆడియెన్స్ ఖాయం: శేఖర్ కమ్ముల