F3 Trailer | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. టాలీవుడ్లో ఇలా సీక్వెల్గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు చాలా వరకు పరాజయాలనే సాధించాయి. ఈ క్రమంలో మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్-3’ బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు.
‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు.. కానీ ఆరో భూతం ఒకటుంది అదే డబ్బు.. డబ్బున్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్టెషన్ అంటూ’ మురళి శర్మ వాయిస్తో ట్రైలర్ ప్రారంభమైంది.’ఏ ఏ ఏయ్ ఎంటీది ఇలా ఉంది అంటూ’ వెంకీ భోజనాన్ని తింటూ అంటుంటాడు. ‘మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు, మనీ ప్లాంట్ వేపుడు’ అంటూ తులసి చెప్తుంది. ‘ఏంటీ ఫుడ్ కూడా మనీ ప్లాంట్స్తోనేనా’ అంటూ వెంకటేష్ ఆశ్చర్యంతో అంటాడు. ‘మన ఆశలే మన విలువలు’ .’పాతిక లక్షలు..దీన్ తల్లి తెల్లారే సరికి యైభై అయిపోవాలి’ అంటూ వచ్చిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.’ఇయ్ ఇలాంటి ఔలా గాల్లందరికి పైసలియ్.. అరే సొంత కొడక్కు పైసల్ ఇయ్యడానికి మనస్సు రాదు’ అంటూ దేవుడితో వరుణ్తేజ్ మొర పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ‘అదో పెద్ద మాయల మరాఠి ఫ్యామిలీ.. వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ ఐ వోంట్ లీవ్ అమ్మా’.. ‘నా మాట విను వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ.. వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ’. అంటూ వచ్చిన డైలాగ్స్ సూపర్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి.ట్రైలర్ చివర్లో ‘ఉన్నదెంతా.. ఎంతుంటే అంతా.. మీరేం మాట్లాడరేంటడి అంతేగా అంతేగా.. వీడికి సీక్వెల్లో కూడా సేమ్ డైలాగా.. అంతేగా అంతేగా’ అంటూ వచ్చిన సంభాషణలు ఎఫ్2 చిత్రాన్ని గుర్తు చేశాయి. ఇక ఓవరాల్గా ట్రైలర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఉంది. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్ పక్కా అని ట్రైలర్ను చూస్తే తెలుస్తుంది.
ఈ సీక్వెల్లో డబ్బు, బంగారం అని ఆశపడే వారి భార్యల వల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలియజేసేలా F3 సినిమా ఉంటుందని అర్థమవుతుంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే వెంకటేష్కు రేచికటీ, వరుణ్ తేజ్కు నత్తి ఉండనున్నట్లు తెలుస్తుంది.. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్చౌహన్లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్లో నర్తించింది. ఇక ఈ చిత్రం గతంలోనే విడుదల కావాల్సంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.