దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న ‘వెంకట్రామయ్యగారి తాలూకా’ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. మానవ సంబంధాల ఆవశ్యకతను తెలియజెప్పే చిత్రమిదని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించామని, కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
జీవితంలో ఎదురైన అనుభవాలనే సినిమాగా మలిచానని, తన గ్రామస్థుల ప్రోత్సాహంతో సినిమా అద్భుతంగా రూపుదిద్దుకున్నదని నిర్మాత కోమలి మహేందర్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ ఆవాల.