Veera Simha Reddy Movie | అదేంటో ఒక్కోసారి కొంతమందిని అదృష్టం అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య విషయంలో ఇదే జరిగింది. ఈ సంక్రాంతికి ముందుగా బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’తో ప్రేక్షకులను పలకరించాడు. విడుదలకు ముందు ఈ సినిమాపై ఒక రేంజ్లో బజ్ ఏర్పడింది. దాంతో రిలీజ్ రోజున ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ సాధించి ఔరా అనిపించింది. ‘అఖండ’తో పోలిస్తే ఈ సినిమాకు రెట్టింపు ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాకుండా బాలయ్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి అభిమానులకు ఈ ఆనందం ఒక్కరోజే ఉంది. తెల్లారి ‘వాల్తేరు వీరయ్య’ దెబ్బకి కనీసం రూ.10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది.
తొలిరోజు సంచలనం సృష్టించిన వీరసింహుడు రెండో రోజు నీరసించిపోయాడు. అమలాపురం నుండి అమెరికా వరకు ప్రతీ చోట డ్రాప్స్ పడిపోయాయి. పైగా రిలీజ్ రోజున వీరసింహా రెడ్డి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్కే ఈ సినిమా పరిమితం అని టాక్ వచ్చింది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ గాలి కాస్త వాల్తేరు వీరయ్య వైపు మళ్లింది. కాగా వాల్తేరు వీరయ్య కూడా మొదటి రోజు మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ దొరకడంతో టాక్తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా వాల్తేరు రిలీజ్తో వీరసింహాకు థియేటర్ల కొరత చాలా వరకు ఏర్పడింది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చిన వీరసింహా రెడ్డి మాత్రం సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకుంది. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ను దాటేసిన వీరసింహా రేపో మాపో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకోనుంది.
నిజానికి ఈ సినిమా ముందు రోజు వచ్చి మంచి పని చేసింది. లేదంటే వాల్తేరు ప్లేస్లో రిలీజయ్యుంటే.. రిజల్ట్ మరోలా ఉండేది. ఎందుకంటే బాలయ్య కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. దాంతో తొలిరోజు భారీగా కలెక్షన్లు వచ్చి సేఫ్ అయిపోయింది. లేదంటే వాల్తేరు ముందచ్చుంటే మాత్రం బాలయ్య సినిమాకు ఎక్కువగా థియేటర్లు దొరికేవి కావు. పైగా వాల్తేరులో రవితేజ కూడా ఉండటంతో ఈ సినిమాకు మాస్రాజా అభిమానుల మద్ధతు లభించింది. ఇలా బాలయ్యకు అదృష్టం బాగానే కలిసి వచ్చింది. నిజానికి వీరసింహా రెడ్డి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చి సంక్రాంతి రేసులో నిలిచింది.