Actress Honey Rose | చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ హనీరోజ్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో అలరించింది. ఈ సినిమాతో హనీరోజ్కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యూత్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్కు వెళ్లింది. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీరోజ్ను అభిమానులు పెళ్లి గురించి అడిగారు.
పెళ్లి ప్రశ్నలపై హనీ స్పందిస్తూ పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత, ఆ బాధ్యతకు తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఎమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితో పాటు నటనపై తనకు చిన్నపటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది. ఇక హనీ 2005లో ‘బాయ్ ఫ్రెండ్’ అనే మలయాళ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ హీరోగా నటించిన ‘ఆలయం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ కొన్నేళ్ల వరకు తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు వరుణ్ సందేష్ హీరోగా నటించిన ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.
మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న టైమ్లో బాలయ్యతో నటించే చాన్స్ కొట్టేసింది. బాలకృష్ణకు తల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో వైవిధ్య నటనను కనబరిచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో నటించిన ‘పూకల్లమ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులోనూ రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.