Prabhas – Sandeep Reddy Vanga | అగ్ర కథానాయకుడు ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశారని, వరుణ్కు తన క్యారెక్టర్ గురించి వివరించారని అంటున్నారు. కాగా దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వవలసి ఉంది.
మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్ను డిఫరెంట్గా చూపించబోతున్నట్లు సమాచారం. ఆరునెలల్లోనే ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.