ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్యాణఘడియలు రానేవచ్చేశాయి. యువహీరో వరుణ్తేజ్, నటి లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మెగా కుటుంబంలో అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇటీలీలోని టస్కానీ వేదికైంది. ఈ వేడుకకు కొణిదెల, త్రిపాఠీల కుటుంబ సభ్యులతోపాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
వరుణ్తేజ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై ఈ వేడుకను పర్యవేక్షించినట్టు తెలిసింది. పెళ్లి పరాయిదేశంలో జరిగినా.. ఎక్కడా భారతీయ కట్టుబాట్లకు ఢోకా రానివ్వకుండా సంప్రదాయబద్ధంగా వరుణ్, లావణ్యల వివాహం జరిగినట్టు సమాచారం. దాదాపు వేడుకకు హాజరైన అందరూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. ఈ వేడుకకు హాజరైన వారిలో చిరంజీవి దంపతులు, పవన్కల్యాణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు ఇంకా మిగిలిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పలువురు ఉన్నారు.