Varuntej-Lavanya Tripathi | వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం మెగా అభిమానులనే కాదు టాలీవుడ్ సినీ ప్రేక్షకుల అందరినీ షాక్ కు గురి చేసింది. ఆరేళ్ల కిందట వచ్చిన మిస్టర్ సినిమాలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఈ సినిమా టైమ్ లోనే వీరిద్ధరూ ప్రేమలో పడినట్లు ఇటివలే లావణ్య తెలిపింది. ఇన్నేళ్లు వీళ్ల రిలీషన్ ను గుట్టు చప్పుడు కాకుండా మేయిన్ టెయిన్ చేశారంటే మాములు విషయం కాదు. సోషల్ మీడియా వచ్చిన్నుంచి ఏ విషయమైన ఇట్టే తెలుసి పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల డేటింగ్ ల గురించి కథ కథలుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిది ఆరేళ్లలో వీళ్ల గురించి ఒక్క రూమర్ కూడా బయటకు రాలేదు. మాములుగానే వరుణ్ తేజ్ బయటకు అంతా హడావిడిగా కనిపించడు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తాడు. అందుకే పెద్దగా హడావిడి లేకుండానే ఎంగేజ్ మెంట్ ను కూడా జరుపుకున్నాడు.
వరుణ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. త్వరలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఇదిలా ఉంటే ఈ జంట సమయం దొరికినప్పుడల్లా బయట చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చిన ఈ జంట.. తాజాగా కాఫీ డేట్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలలో పంచుకున్నారు. లావణ్య త్రిపాఠి ఫోటోను వరుణ్ తన స్టోరీలో పెట్టిగా.. వరుణ్ ఫోటోను లావణ్య తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ఈ ఫోటోలను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. కపుల్ గోల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వరుణ్ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. దీనితో పాటుగా ఏయిర్ ఫోర్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా మనుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక లావణ్య తనాల్ అనే తమిళ సినిమా చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.