యువ హీరో వరుణ్తేజ్, కథానాయిక లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు శుక్రవారం హైదరాబాద్లో మొదలయ్యాయి. జూన్ 9వ తేదీన ఈ జంటకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో వారు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో చిరంజీవి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన సోషల్మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇటలీలోని టస్కానీ పెళ్లికి వేదిక కానుందని, మెగా హీరోలందరూ ఓ వారం పాటు షూటింగ్లకు బ్రేక్ తీసుకొని వివాహ వేడుకలో పాల్గొనబోతున్నారని తెలిసింది.