సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మైఖేల్’. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా..వరుణ్ సందేశ్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్ నాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రంజిత్ జయకోడి. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూస్కూర్ రామ్మోహన్రావు, భరత్ చౌదరి నిర్మాతలు. నారాయణదాస్ కె నారంగ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.