వరుణ్ధావన్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భేడియా’ తెలుగులో ‘తోడేలు’ పేరుతో ఈ నెల 25న విడుదలవుతున్నది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తున్నది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కొంతభాగం చూశాను. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలున్నాయి’ అన్నారు.
‘హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తున్నది. ఓ దర్శకుడి తనయుడిగా సినిమా నా రక్తంలోనే ఉంది. మేం తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటాం. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా’ అని హీరో వరుణ్ధావన్ పేర్కొన్నారు. తన కెరీర్ను తెలుగులోనే మొదలుపెట్టానని, మరోసారి తెలుగువారు ప్రేమను అందివ్వాలని కథానాయిక కృతిసనన్ కోరింది. అల్లు అరవింద్గారిని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని నిర్మాత దినేష్ విజన్ తెలిపారు.