కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వారసుడు (Vaarasudu) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. తమిళంలో వారిసు టైటిల్తో వస్తోన్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను ఆన్లైన్లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నైలోని మెట్రో ట్రైన్కు వారిసు పోస్టర్లను అతికించి సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. తమిళనాడులో వారిసు చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సిల్వర్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది.
వారసుడు చిత్రాన్ని కన్నడలో కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చేసింది. అంతేకాదు స్వాగత్ ఎంటర్ప్రైజెస్ వారసుడు కర్ణాటక (కన్నడ) హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్. వారసుడు నుంచి రిలీజైన రంజితమే సాంగ్ యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాప్ ట్రెండింగ్లో నిలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారసుడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా..ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రమోషనల్ క్యాంపెయిన్..
The Boss Returns 🔥
Chennai Metro Carries #Varisu 🚝🔥#Varisu in theatres near you from Pongal 2023 😊#Thalapathy @actorvijay @SVC_official @directorvamshi@iamRashmika @MusicThaman@Jagadishbliss #VarisuPongal 🔥 pic.twitter.com/uLdsSd0xiR
— Seven Screen Studio (@7screenstudio) December 12, 2022