కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వారిసు. తెలుగులో వారసుడుగా విడుదలైంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న తమిళనాడులో విడుదల కాగా.. తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14న విడుదలైంది.
తొలి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో తన రేంజ్ ఏంటో చూపిస్తూ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు విజయ్. తాజాగా వారిసు కలెక్షన్ల సునామి ఎలా ఉందో తెలియజేసే అఫీషియల్ అప్డేట్ తెరపైకి వచ్చింది. వారిసు ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో రూ.250 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇలాంటి అరుదైన మైల్స్టోన్ చేరుకున్న సినిమా వారిసు కావడం విశేషం.
వారిసు చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్ , శరత్కుమార్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
గ్లోబల్ కలెక్షన్లలో వారిసు రికార్డు..
Podra bgm ah 🔥#MegaBlockbusterVarisu collects 250Crs+ worldwide in 11 days nanba 🤩#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @TSeries #Varisu #VarisuPongal#VarisuHits250Crs pic.twitter.com/I1UJgRIGoJ
— Sri Venkateswara Creations (@SVC_official) January 23, 2023