Varalakshmi | హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి.. అది పెద్దగా కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా టర్న్ తీసుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పుడీ లేడీ డాన్కు ఇండస్ట్రీలో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ అమ్మడుకు భారీ డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద సినిమాల్లో లేడీ విలన్ రోల్స్తో మెప్పిస్తూ దూసుకుపోతుంది. నిజానికి ఆమెకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది మాత్రం క్రాక్లోని జయమ్మ పాత్రే. లిటరల్గా ఈ పాత్రలో వరలక్ష్మి జీవించింది. క్రాక్ అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో సగం క్రెడిట్ వరలక్ష్మికే దక్కుతుంది. దాంతో గోపిచంద్ మలినేని వీరసింహా రెడ్డిలో బాలయ్యకు చెల్లెలిగా భానుమతి రెడ్డి క్యారెక్టర్ను ఇచ్చాడు. ఆ పాత్రలోనూ వరలక్ష్మి శరత్ కుమార్ ఇరగదీసింది.
ఇలా తన కెరీర్లో సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన రెండు సినిమాల్లో వరలక్ష్మి ఉంది. దాంతో ఆమెను సెంట్మెంట్గా భావించి తన నెక్స్ట్ సినిమాలో ఆమె కోసం స్పెషల్గా ఓ ఓ పవర్ ఫుల్ పాత్ర రాసుకున్నాడట. గోపిచంద్ మలినేని తన తదుపరి సినిమాను రవితేజతో చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ కూడా ఖరారు కానీ ఈ సినిమాలో వరలక్ష్మి మాత్రం ఓ ముఖ్య పాత్రకు ఎంపిక అయ్యిందట. మైత్రీ మూవీ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ స్వరాలు సమకూర్చనున్నట్లు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ మూవీలో వరలక్ష్మి కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ఆమె పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనితో పాటుగా సబరి అనే మరో తెలుగు సినిమా చేస్తుంది.