వారాహి చలనచిత్రం సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున్నది. ఈ సినిమాతో కిరీటి కథానాయకుడిగా పరిచయం కానున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలోని నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.