పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో నిరంతరంగా సాగుతున్నది. తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన మరో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…“గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగమవ్వాలని కోరుతున్నా. పచ్చని ప్రకృతి కోసం మనమంతా మొక్కలు నాటాలి’ అన్నారు.