బాలీవుడ్ యూత్ స్టార్ టైగర్ ష్రాఫ్ హిందీ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులని సైతం అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయనని మహేష్ కూతురు సితార తెగ ఇష్టపడుతుంది. టైగర్ తన బాడీని మలచుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ముఖ్యంగా టైగర్ యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్లతో ఎంతగా అదరగొడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా సింగర్ అవతారం ఎత్తిన టైగర్ ష్రాఫ్.. స్వాతంత్ర్య దినోత్సవం కోసం ”వందేమాతరం” అనే స్పెషల్ మ్యూజిక్ వీడియో రూపొందించాడు. తొలి సారి పాట పాడిన టైగర్.. ‘వందేమాతరం’ అనేది కేవలం పాట మాత్రమే కాదని.. ఇదొక ఎమోషన్ అని అన్నారు. ఇలాంటి స్పెషల్ సాంగ్ ని పాడి దేశానికి అంకితమివ్వడం మీతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నానని టైగర్ తెలిపారు.
‘హిందుస్తాన్ మేరీ జాన్.. హిందుస్తాన్.. మేరీ జాన్ మేరీ షాన్..’ అంటూ సాగిన ఈ దేశభక్తి గీతానికి విశాల్ మిశ్రా అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. టైగర్ ష్రాఫ్ పాడిన ఈ పాటకు కౌశల్ కిశోర్ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ను జాకీ భగ్నాని నిర్మించారు. అంకన్ సేన్ – జూలీ వైద్య – రాహుల్ శెట్టి కలిసి చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. విజువల్స్ కూడా బాగున్నాయి. ఈ పాటని దేశాన్ని రక్షిస్తున్న త్రివిధ దళాలతో పాటు ప్రతి ఒక్క భారతీయుడికి అంకింతం ఇస్తున్నట్టు టైగర్ పేర్కొన్నారు.