అజిత్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వాలిమై’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ను ఈ నెలలోనే పునఃప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా చిత్రీకరణలో చాలా అవరోధాలు ఎదురైనట్లు దర్శకుడు వినోద్ తెలిపారు. ‘సినిమా ఆరంభంలో సీనియర్ నటులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. మొదటి దశ లాక్డౌన్ అనంతరం గత ఏడాది షూటింగ్ను పునఃప్రారంభించే సమయంలో కొవిడ్ భయాలతో వారందరూ చిత్రీకరణలో పాల్గొనడానికి నిరాకరించారు. సీనియర్స్ స్థానంలో నూతన నటుల్ని తీసుకొని ఆ సమయంలో మాకు దొరికిన కొత్త లొకేషన్స్లో సినిమాను రీషూట్ చేశాం’ అని తెలిపారు. ఇందులో అజిత్ సీబీసీఐడీ అధికారిగా కనిపిస్తారని దర్శకుడు పేర్కొన్నారు. విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్గా ఉన్నట్లు చెప్పారు. విదేశీ ప్రయాణాలపై విధించిన ఆంక్షలు తొలగిపోగానే మిగిలిన షూటింగ్ను పూర్తిచేస్తామని వినోద్ అన్నారు. కార్తికేయ గుమ్మకొండ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు.