మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదానికి గురై అపోలోలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అపోలో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో తేజ్కి ట్రీట్మెంట్ నడుస్తుంది.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. కొందరు కోమాలోనే ఉన్నారంటే మరి కొందరు మాట్లాడుతున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సోదరుడి ఆరోగ్యంపై స్పందించాడు.
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం కొండపోలం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనని తేజూ ఆరోగ్యం గురించి అడ్గగా, దానికి తేజు ఆరోగ్యం బావుంది. త్వరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఫిజికల్ థెరపీ జరుగుతోంది. బహుశా మరో వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటించాడు. ఈ వార్త విని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సాయి ధరమ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.