సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘సెన్సారు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ను అందజేశారు. రెండు గంటల 15 నిమిషాల నిడివితో చిత్రం ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘నీలో నాలో..శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అనే గీతానికి చక్కని స్పందన వస్తున్నది. సంగీతంతో పాటు ఈ గీతానికి కీరవాణి సాహిత్యం అందించడం విశేషం. రవీంద్రయాదవ్ అనే యువకుడు తనకు నల్లమల అరణ్యంలో ఎదురైన పరిస్థితుల్ని ఎలా జయించాడు అన్నదే చిత్ర కథ. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే విశ్వాసం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్: రాజ్కుమార్ గిబ్సన్, సమర్పణ: బిబో శ్రీనివాస్.