హిందీ చిత్రసీమలో గ్లామర్ తారగా మంచి గుర్తింపును సంపాదించుకుంది వాణీకపూర్. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా యువతరానికి చేరువైంది. తాజాగా ఈ భామ ఓటీటీలోకి అరంగేట్రం చేయబోతున్నది. యష్రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యచోప్రా తెరకెక్కించనున్న ‘మందాల మర్డర్స్’ సిరీస్లో వాణీకపూర్ ప్రధాన పాత్రను పోషించనుంది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన కొన్ని యథార్థ నేర సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించబోతున్నారు. మనన్ రావత్ దర్శకత్వం వహిస్తారు. ఓటీటీల్లో నటించే విషయంలో గతకొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న వాణీకపూర్ ఎట్టకేలకు ఈ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో అరంగేట్రం చేస్తున్నది.
‘సినిమా కథల విషయంలో నేను చాలా సెలెక్టివ్గా ఉంటాను. అందుకే ఈ మధ్యకాలంలో ఏ సినిమా అంగీకరించలేదు. ఈ సిరీస్ సబ్జెక్ట్ బాగా నచ్చింది. ఓటీటీ వేదికలో నాకు మంచి ఆరంభాన్ని ఇస్తుందని నమ్ముతున్నా’ అని వాణీ కపూర్ ఆనందం వ్యక్తం చేసింది. లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి వంటి ప్రదేశాల్లో ఈ సిరీస్ చిత్రీకరణ సాగనుంది. హిందీలో శుద్ధ్దేశీ రొమాన్స్, బేఫిక్రే, వార్, బెల్బాటమ్ వంటి చిత్రాలు వాణీకపూర్కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.