బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని రెండో గీతం ‘ఉయ్యాలో ఉయ్యాలా’ ఈ నెల 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో బాలకృష్ణ నది ఒడ్డున కూర్చొని పాపతో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారు. బాబాయ్, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. కూతురు శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ బాబాయ్ కథ ఇదని, యాక్షన్తో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని చెబుతున్నారు. బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తున్నది. కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్ప్రసాద్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.