విజయ్, శ్రావ్య జంటగా దర్శకుడు రాజారెడ్డి పానుగంటి రూపొందిస్తున్న సినిమా ‘ఉత్తమ విలన్ కేరాఫ్ మహదేవపురం’. హృషీకేష క్రియేషన్స్, భీష్మ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మీనారాయణ గౌడ్, పి.శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉందీ చిత్రం. తాజాగా ఈ సినిమా టీజర్ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ..‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం’ అన్నారు. జబర్దస్త్ అప్పారావు, సాయి, హరీష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.