Bheemla nayak | పవర్స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ చిత్రం భీమ్లానాయిక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నాడు. సినిమా అనౌన్స్చేసినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమాపైన ప్రేక్షకులలో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరపరిచిన పాటలైతే యూట్యూబ్లలో కోట్ల వ్యూస్ను సాధించాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 12నే ఈ సినిమా విడుదల కావాల్సింది. అప్పటికే ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలను తేదిలను ప్రకటించాయి. దాంతో సినీప్రముఖులు భీమ్లానాయక్ మేకర్స్తో చర్చలు జరిపి విడుదల తేదిని వాయిదా వేసారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాలు కూడా విడుదల వాయిదా పడ్డాయి. తాజాగా భీమ్లానాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో ఈ చిత్రానికి బిజినెస్ ఓ రెంజ్లో జరిగింది. తాజాగా USAలో ఆన్లైన్లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కేవలం 77 లోకేషన్స్లో ఆన్లైన్ టికేట్స్ ద్వారానే కోటిన్నర పైగా కలెక్షన్ వచ్చాయి.
నైజాంలో టికేట్స్ ఆన్లైన్లో కాకుండా కౌంటర్ సేల్ ద్వారా విక్రయించాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు పంపించారు. దీనికి కారణం బుక్ మై షో అదనపు కమిషన్. తెలంగాణలో టికేట్ రేట్లు పెంచుకునే వెసలు బాటు ప్రభుత్వం కల్పించింది. దాంతో ఈ సినిమా టికేట్ కాస్ట్తో పాటు బుక్ మై షో కమిషన్ కలిపితే టికేట్ రేటు మరింత పెరుగుతుందని భావించి టికేట్లను కౌంటర్ సేల్ ద్వారానే విక్రయించాలని వెల్లడించింది.ఒక వేళ బుక్ మై షో సంస్థ అదనపు ఛార్జీలను తగ్గిస్తే అప్పుడు ఆలోచిద్దాం అని నిర్మాతలు భావిస్తున్నారు. టికెట్ల కోసం లైన్లో నిలబడే అవసరం లేకుండా మనం ఎక్కడుంటే అక్కడ బుక్ మై షో ద్వారా టికేట్లను విక్రయించే వెసలుబాటు కల్పించింది. ప్రేక్షకులు కూడా దీనికి బాగా అలవాటు పడ్డారు. మరి భీమ్లానాయక్ చిత్రానికి లైన్లో నిల్చొని ప్రేక్షకుల టికెట్లను విక్రయిస్తారా అనేది కూడా సినివర్గాల్లో ఓ చర్చనియాంశమైంది.