ఈ కాలం నాటి భామలు అందాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు చేయని ప్రయత్నలే లేవు. తాజాగా హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా శరీరం మరింత ప్రకాశవంతంగా మారేందుకు మడ్ బాత్ చేసింది. తన మడ్ బాత్ ఫొటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, ఇది చూసిన నెటిజన్స్ విగ్రహం అనుకున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలా చేయడానికి కారణం కూడా చెప్పుకొచ్చింది ఊర్వశి.
అందాన్ని మరింత మెరుగుపరచుకోవడంతో పాటు శరీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నానని తెలిపింది ఊర్శశి. శరీరం మొత్తం రేగడి మట్టి పూసుకొని కూర్చుంటే శరీరంతో పాటు మనసుకు ప్రశాంతత ఉంటుందంటుంది ఈ హాట్ బ్యూటీ. రీసెంట్గా జిమ్ వర్కవుట్ వీడియో ఒకటి షేర్ చేయగా, ఇందులో జిమ్ ట్రైనర్తో కడుపులో పిడి గుద్దులు గుద్దించుకుంది. తన తర్వాతి సినిమా యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆ సినిమా కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు పేర్కొంది.