ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొవిడ్ తేలికపాటి లక్షణాలు ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్గా వచ్చింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. ప్రస్తుతం తానే బాగానే ఉన్నానని, హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల తనను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
రాబోయే దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ.. కరోనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా బారినపడ్డ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు ట్వీట్ చేశారు. ఇంతకు ముందు నటి నిషా రావల్ సైతం కరోనా బారినపడ్డారు. కరోనాను తేలిగ్గా తీసుకోద్దంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ఇప్పటికీ మన చుట్టే ఉందని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ ధరించాలని.. చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.