Konidela Upasana | చిరు నట వారసత్వాన్ని అజేయంగా కొనసాగిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్. రీజినల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా మారి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా ఫ్యామిలీ మ్యాన్గానూ చరణ్ ఇంట్లో వాళ్లతో వీలైనంత ఎక్కువగానే గడుపుతుంటాడు. ఇక చరణ్ 2012లో అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన, పెళ్లైన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కున్నానని తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపింది.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా చరణ్ పరిచయమయ్యాడని ఉపాసన వెల్లడించింది. ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని, ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరైనా ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పింది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తనను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారని, సమాజంలో చాలా మంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారేనని వెల్లడించింది. పెళ్లైన కొత్తలో తను బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. అప్పుడు తన బాగా లావుగా ఉన్నానని, అందంగా లేనని, కామెంట్స్ చేశారాని చెప్పుకొచ్చింది. ఇక మరికొందరైతే చరణ్ కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని అన్నారని. ఆ సమయంలో తను కుంగిపోకుండా.. వాటిని ధైర్యంగా జయించానని పేర్కొంది. ఇక ఆరోజు తనను ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
ఇక చరణ్ ఎల్లప్పుడూ తనకు అండగా, మార్గదర్శిగా ఉన్నాడని చెప్పింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుతున్నప్పుడు చరణ్ వెంటే ఉండి మానసికంగా తనకు ధైర్యం ఇచ్చానని ఉపాసన వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక రామ్చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్, బుచ్చి బాబు ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడు.