వెండితెరపై రికార్డులు క్రియేట్ చేసిన బాలయ్య ఇప్పుడు అన్స్టాపబుల్ అనే టాక్ షోతోను చరిత్రలు తిరగరాస్తున్నాడు. ఆహా కోసం హోస్ట్గా మారిన బాలకృష్ణ తనదైన ఉత్సాహంతో హోస్ట్గా అదరగొడుతున్నాడు.ఈ షోకి సంబంధించిన తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు హాజరు కాగా, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. ఈ రెండు ఎపిసోడ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
భుజానికి జరిగిన శస్త్ర చికిత్స వలన కాస్త గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడు మళ్లీ అన్స్టాపబుల్ షోలో అడుగుపెట్టాడు. బ్రహ్మానందం, అనీల్ రావిపూడితో తెగ సందడి చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేయగా, ఇందులో బాలకృష్ణ, బ్రహ్మానందం కలిసి చేసిన రచ్చ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంది. షో మొత్తం నవ్వులే నవ్వులు ఉంటాయని అనిపిస్తుంది.
డిసెంబర్ 3 రాత్రి 8 గంటల నుంచి టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీమ్స్కు సంబంధించి ఈ టాక్ షోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏదేమైన ఈ షో మరో లెవల్కి వెళుతుందని తెలుస్తుంది.