Celina Jaitely | ఆస్ట్రేలియాలో నివసిస్తున్న బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ, భారత సాయుధ దళాలను, దేశాన్ని పొగుడుతూ చేసిన సోషల్ మీడియా పోస్టులపై కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఈ ట్రోల్స్కు ఆమె తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చింది. తన దేశం కోసం నిలబడతానని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది. భారతదేశం, సైనిక బలగాల పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేయడంతో, కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం ప్రారంభించారు. భారత్ను పొగిడితే అన్ఫాలో చేస్తామని బెదిరించారు. దీనికి సమాధానంగా సెలీనా ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్ గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొందరు నన్ను బెదిరిస్తున్నారు. అలాంటి వారందరి కోసమే ఈ పోస్ట్. నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ ఎవరికీ క్షమాపణలు చెప్పను” అని సెలీనా తన ప్రకటనలో తేల్చి చెప్పారు. ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలను బలిగొంటుంటే తాను మౌనంగా ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. “ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. హింసను సమర్థిస్తూ, దాన్ని ప్రోత్సహించే వారి వైపు నేను ఎప్పుడూ నిలబడను” అని ఆమె కుండబద్దలు కొట్టారు.
భారత్పై తనకున్న ప్రేమ ఇతరులను బాధించినా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాను చేసే వ్యాఖ్యలు వినలేకపోయినా, సోషల్ మీడియాలో తనను అనుసరించడం మానేయవచ్చని సెలీనా సూటిగా చెప్పారు. “నేను శాంతి కోసం మాట్లాడతాను. సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. ఎందుకంటే నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు. మీ అందరి ట్రోల్స్, బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వారిని క్షమించను. జైహింద్” అంటూ ఆమె తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూడా ఆమె ప్రస్తావించారు.