కరోనా సెకండ్ వేవ్ వలన మూతపడ్డ థియేటర్స్ తిరిగి తెరచుకున్న విషయం తెలిసిందే. జూలై 30 నుండి థియేటర్స్ లో సందడి మొదలైంది. వినాయక చవితి నుండి పెద్ద సినిమాల జాతర మొదలుకానుండడంతో చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్స్ని ప్రకటిస్తున్నారు. పాగల్, క్రేజీ అంకుల్ వంటి చిత్రాలు ఇటీవల రిలీజ్ డేట్ ప్రకటించగా, ఇప్పుడు సుశాంత్, అవసరాల శ్రీనివాస్ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు.
థియేటర్స్కి ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో అందరు నిర్మాతలు ఓటీటీకి నో చెప్పి థియేటర్స్ లోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన సుశాంత్ “ఇచట వాహనములు నిలుపరాదు” అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు ఎస్ దర్శన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆగష్టు 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు.
ఇక అవసరాల శ్రీనివాస్ మరియు రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి సమర్పణ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు.ఆగస్ట్ 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.