విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా (Son of India). యాక్షన్ డ్రామా నేపథ్యంలో డైమండ్ రత్నబాబు (Diamond Ratna Babu)ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 18 శుక్రవారం విడుదలవుతుంది. అయితే ఈ సినిమా కొన్ని గంటల్లోనే సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్న నేపథ్యంలో నెటిజన్లు పెడుతున్న ట్రోలింగ్స్ (Trolls)ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.
కేవలం ఇప్పటివరకు రెండు టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి..మీకు ముగ్గురు పిల్లలుండి వారిలో ఇద్దరే మీ సినిమా టికెట్ కొంటే..ఇప్పటివరకు గ్రాస్ రూ.500 అంటూ..ఇలా నెటిజన్లు సన్ ఆఫ్ ఇండియా సినిమాపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలే తప్ప..ఇతరులను కించపరిచేలా ఉండకూడదు. సాధారణంగా నేను వాటిని పట్టించుకోను. ఎవరైనా తనకు పంపినపుడు మాత్రమే ట్రోల్స్ ను చూస్తుంటానని చెప్పుకొచ్చాడు.
ట్రోల్స్ను పట్టించుకోకూడదు. కానీ ట్రోలింగ్ హద్దులు దాటినపుడు, ఎదుటి వారిని సెటైరికల్గా ట్రోల్స్ చేయడం బాధ కలిగిస్తుంది. దీని వెనుక ఇద్దరు హీరోలున్నారు. ట్రోల్స్ చేయించడానికి వాళ్లు సుమారు 50 నుంచి 100 మందిని నియమించుకున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వారికి ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. అప్పుడు వారి కి ఎవరూ సహాయపడరు. వారి వెనక ఎవరూ ఉండరని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.