ప్రస్తుతం టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శంకర్- రామ్ చరణ్ సినిమా, ధనుష్- శేఖర్ కమ్ముల చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ మూవీస్ ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాలని డిసెంబర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాని విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తున్నట్లు టాక్. ఇక రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. ఇక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. సాయి మాధవ్ బుర్రా చిత్రానికి పని చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.