అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తెలుగు, హిందీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ట్వింకిల్ 2001లో అక్షయ్ కుమార్ను వివాహం చేసుకుంది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. ప్రస్తుతం వారి ఆలనాపాలనా చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయిటే ట్వింకిల్ తెలుగులో కూడా నటించింది. వెంకటేశ్ హీరోగా నటించిన ‘శీను’ సినిమాలో సందడి చేసిన ట్వింకిల్ ఆ తర్వాత బాలీవుడ్లోనే సెటిల్ అయింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ట్వింకిల్ ఆసక్తికర విషయాలు నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. అందులో ఒక పుస్తకం ఫొటోను పంచుకున్న ఆమె.. ‘ఈ పుస్తకం పేరు ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా’.. ప్రముఖ సినీ విమర్శకురాలు, సంపాదకురాలు భావన సొమయ్య ఈ పుస్తకాన్ని రాసింది. నా సినిమా జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు అమ్మ (డింపుల్ కపాడియా)కు, నాకు మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను ఈ పుస్తకం తిరిగిచ్చింది’ అని చెప్పుకొచ్చింది.
ఈ పోస్ట్పై రచయిత్రి భావన స్పందిస్తూ… 1994లో ముంబై విమానాశ్రయంలో డింపుల్ కపాడియా మరియు కూతురు ట్వింకిల్ని కలిసాను. వారు ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుండగా, ట్వింకిల్ తన భుజాలపై బరువు మోస్తూ కనిపించింది. డింపుల్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఎందుకు బరువులు మోస్తున్నావు అని ట్వింకిల్ను అడగ్గా.. ‘ మా అమ్మకు చెకింగ్ బ్యాగులంటే ఇష్టం ఉండదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎక్కువగా ఎదురు చూడడం ఆమెకు నచ్చదు. అందువల్ల భారీ బరువులను మోస్తూ నేను కూలీగా మారాల్సి వచ్చింది’ అని సమాధానమిచ్చిందిట. నువ్వు నటివైతే నీకు స్వాతంత్ర్ర్యం పోతుంది అంటే ఏమో అని నేను అంటే భవిష్యత్తు గురించి నాకు తెలియదు. ప్రస్తుతం నా తల్లికి నేను కూలీగా మారాను అంటే ట్వింకిల్ చెప్పిందని రచయిత్రి స్పష్టం చేసింది.