Actor Manoj | శామీర్పేట్ కాల్పుల కేసులో నటుడు మనోజ్ను పోలీసులు ఆదివారం రిమాండ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అల్వాల్లో న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మనోజ్పై కేసు నమోదు చేశారు. శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో శనివారం జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సిద్ధార్థదాస్ అనే వ్యక్తిపై మనోజ్ ఎయిర్గన్తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధార్థ్ తప్పించుకొని, శామీర్పేట పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ అనే వ్యక్తి స్మిత అనే మహిళతో పెళ్లియ్యింది. 2019లో విడిపోయారు. వీరిద్దరికి కూతురు, కొడుకు ఉన్నారు. అయితే, స్మిత శామీర్పేటలోని ఓ విల్లాలో మనోజ్తో సహజీవనం చేస్తుంది. అయితే, సిద్ధార్థ్ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు. ఈ క్రమంలోనే స్మితతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మనోజ్ ఆగ్రహానికి గురై.. కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకొని శామీర్పేట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి 307 కింద నిందితుడు మనోజ్పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.