రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రాన్ని టీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, హరికృష్ణ మాట్లాడుతూ…‘సినీ రంగంలోకి రావాలన్నది మా కల.
ప్రేక్షకుల అభిమానం పొందేలా మంచి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాం’ అన్నారు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ…‘మా సంస్థలో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రంతో మా ఇద్దరు పిల్లలను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. వీళ్లు కవల పిల్లలు. నటనలో మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటిస్తాం’ అన్నారు.