త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శకుటుంబం’. ‘హౌస్ నెం.47 – ఏకే 47’ అనేది ఉపశీర్షిక. శ్రీనిధిశెట్టి కథానాయిక. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. నిజానికి ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి సమ్మర్లోనే విడుదల చేయాలని ముందు మేకర్స్ భావించారు.
కానీ నాణ్యత విషయంలో రాజీ పడని కారణంగా అది జరగలేదు. సమ్మర్ తర్వాత సినిమాకు అతిపెద్ద సీజన్ అంటే అది దసరా సీజనే. అందుకే దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.