టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (MaheshBabu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28). త్రివిక్రమ్ శ్రీనివాస్ సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలంటే చాలా సమయమే తీసుకుంటాడు. సినిమాను వేగంగా కంప్లీట్ చేయాలని ప్రయత్నించినా, సెట్ ప్రాపర్టీస్, కాస్టింగ్ అంశాలు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. చిన్న పాత్ర అయినా సరే ఎవరైనా నటి కానీ, నటుడు కానీ కావాలని ఫిక్సయితే.. వారి డేట్స్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తాడు.
తద్వారా సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. కానీ త్రివిక్రమ్ ఎస్ఎస్ఎంబీ 28 కోసం మొదటిసారి కాంప్రమైజ్ అవుతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వివిధ భాషల నటీనటులను సినిమాకు తీసుకోవాలని అనుకుంటున్న త్రివిక్రమ్కు.. ప్రస్తుతం బిజీగా ఉన్న ఆయా భాషల నటీనటులను సెట్స్ పైకి తీసుకురావడం కష్టమైన టాస్క్. కాబట్టి షూటింగ్కు ఇబ్బంది కలగకుండా.. ఆర్టిస్టులను సెట్స్ కు తీసుకొచ్చే ముందు షూటింగ్ డేట్స్ ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్. ప్రస్తుతానికి మహేశ్ బాబు, పూజాహెగ్డే, శ్రీలీల డేట్స్ను ఒకే చేశాడట.
సమయాన్ని ఆదా చేసేందుకు ఇండియాలోనే షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్ . ఎస్ఎస్ఎంబీ 28 లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో రాబోయే ఐటెం సాంగ్లో కన్నడ భామ రష్మిక మందన్నా మెరువనుందని వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.