Trisha | 2002లో ‘మౌనం పేసియాదే’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది త్రిష. అంటే కథానాయికగా తన ప్రయాణానికి 21ఏండ్లు. హీరోయిన్గా రెండు దశాబ్దాల పైన కెరీర్ అంటే చిన్నవిషయం కాదు. ఈ క్రెడిట్ చాలా తక్కువమంది కథానాయికలకు మాత్రమే ఉంది. పైగా నేటికీ త్రిష స్టార్ హీరోయినే. ఇప్పటికీ విజయాలను అందుకుంటూనే వుండటం విశేషం.
మొన్న ‘పొన్నియన్ సెల్వం’ సిరీస్తో వరుసగా రెండు విజయాలు అందుకోగా, ఇప్పుడు ‘లియో’తో మూడో హిట్ కొట్టి, ఈ లేట్ వయసులో కూడా హ్యాట్రిక్ సొంతం చేసుకుంది త్రిష. ఇదిలావుంటే.. తన రీసెంట్ హిట్ ‘లియో’ విజయోత్సవంలో భాగంగా హాజరైన త్రిష వేదికపై ఆసక్తికరంగా మాట్లాడింది.
‘ కొన్నేళ్ల విరామం తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ కలిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో విజయ్తో సినిమా చేస్తుంటే నాకు అలాంటి అనుభూతి కలిగింది. నా కెరీర్లో ఎక్కువ సినిమాలు తనతోనే చేశాను. విజయ్ సింప్లిసిటీ, పనిపై తనుపెట్టే ఎఫెర్ట్ వేరెవరిదగ్గరా చూడలేం. నా చిరకాల మిత్రుడితో మళ్లీ ఓ సినిమా చేయాలనుంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో’ అంటూ ఉద్వేగంగా మాట్లాడింది త్రిష. ఆమె మాటలు తమిళ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.