అందాల తార త్రిష మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమె నాయికగా ఎంపికైనట్లు సమాచారం. మణిరత్నం- కమల్హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా క్లాసిక్గా నిలిచింది. మళ్లీ ఇన్నేండ్లకు వీరు కలిసి సినిమా చేస్తున్నారు. ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 1’ చిత్రంతో త్రిష సూపర్హిట్ అందుకుని ఫామ్లోకి వచ్చింది.
ఈ క్రేజ్తోనే ఆమె ఈ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తున్నది. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జయింట్ మూవీస్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్, త్రిష కలిసి గతంలో ‘తూంగవనం’ చిత్రంలో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదలైంది. నట ప్రయాణం ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా త్రిష ఇలాంటి అరుదైన చిత్రాలను దక్కించుకోవడం ఆమె ప్రతిభకు, ఆకర్షణనకు నిదర్శనంగా నిలుస్తున్నది.