రజనీకాంత్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం కామెడీ హారర్ థ్రిల్లర్గా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పి.వాసు దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై చర్చ జరుగుతున్నది. పలువురు అగ్ర నాయికల పేర్లు తెరమీదకొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనుందని తెలిసింది. తొలిభాగంలో చంద్రముఖిగా జ్యోతిక ప్రదర్శించిన భయానక రస ప్రధానమైన అభినయం అందరికి గుర్తుండిపోయింది. ఇప్పుడు సీక్వెల్లో త్రిష పాత్ర ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ‘చంద్రముఖి-2’లో వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలో ఇప్పటికే భారీ సెట్స్ను తీర్చిదిద్దారని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుందని తెలిసింది.